భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. అక్టోబర్ 30, శుక్రవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 80,88,851 కు, మరణాల సంఖ్య 1,21,090 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 48,648 కరోనా పాజిటివ్ కేసులు, 563 కరోనా మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా 73 లక్షలు దాటింది. ఒకే రోజులో 57,386 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 73,73,375 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 91.15 శాతంగా నమోదైంది. కాగా కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంది. అలాగే దేశవ్యాప్తంగా ప్రస్తుతం 5,94,386 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు దేశంలో అక్టోబర్ 29 నాటికీ 10,77,28,088 కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లోనే 11,64,648 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu