ఇటీవల హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలు వలన పెద్దఎత్తున నష్టం జరిగిన సంగతి తెలిసిందే. నగరంలో వరద బాధితులకు అండగా ఉండేందుకు పలు సంస్థలు, పలువురు పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు ముందుకొచ్చి తెలంగాణ సీఎం సహాయనిధికి విరాళం అందించారు. ఈ నేపథ్యంలో నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయ కార్యక్రమాల కోసం తమ వంతు సాయంగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ సంస్థ 5 కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది. ఆ సంస్థ ప్రతినిధి రూ.5 కోట్ల చెక్కును గురువారం నాడు మంత్రి కేటిఆర్ కు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ సంస్థకు మంత్రి కేటిఆర్ ధన్యవాదాలు తెలిపారు.
Heartfelt thanks to @drreddys Laboratories Ltd for donating Rs 5 Crore to Telangana CM Relief Fund: Minister @KTRTRS pic.twitter.com/wE23E464Hd
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) November 5, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ