మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గురువారం కొత్తగా 8,010 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 61,89,257 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో 170 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,26,560 కు పెరిగింది. అదేవిధంగా కొత్తగా 7,391 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 59,52,192 కు చేరింది. ప్రస్తుతం మహారాష్ట్రలో 1,07,205 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (జూలై 15, గురువారం నాటికీ):
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 4,48,24,211
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 61,89,257
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 59,52,192
- కరోనా రికవరీ రేటు – 96.17%
- యాక్టీవ్ కేసులు – 1,07,205
- జూలై 15న నమోదైన కేసులు – 8,010
- జూలై 15న డిశ్చార్జ్ అయినవారు – 7,391
- జూలై 15న నమోదైన మరణాలు – 170
- మొత్తం మరణాల సంఖ్య – 1,26,560
- కరోనా మరణాలు రేటు – 2.04%
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ