ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నెల్లూరు జిల్లాలోని చిలుకూరు మండలం తమ్మినపట్నం-మోమిడి గ్రామాల పరిధిలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ప్లాంట్ ఏర్పాటుకు జిందాల్ స్టీల్ ఆంధ్ర లిమిటెడ్ కంపెనీకి 860 ఎకరాల భూములు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భూముల కేటాయింపుపై గురువారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.7,500 కోట్లతో 2.25 ఎంటీపీఏ సామర్థ్యంతో జిందాల్ సంస్థ ఈ స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ స్టీల్ప్లాంట్తో 2,500 మందికి ప్రత్యక్షంగా, 15వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఏపీఐఐసీ(ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇందుకు సంబంధించిన అన్ని అవసరమైన చర్యలు తీసుకుని, ఎప్పటికప్పుడు పనుల పురోగతిని ప్రభుత్వానికి తెలియజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ