మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. రోజువారీగా పెద్దసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మార్చి 3, బుధవారం నాడు కూడా 9,855 కరోనా కేసులు, 42 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,79,185 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 52,280 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 6,559 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 20,43,349 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 93.77 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.40 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 82,343 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు బుధవారం నాటికి మహారాష్ట్రలో 1,65,09,506 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ