దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 23,950 కరోనా కేసులు, 333 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,00,99,066 కు, మరణాల సంఖ్య 1,46,444 కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్స్ మరియు ఆసుపత్రుల్లో 2,89,240 మంది బాధితులు కరోనాకు చికిత్స పొందుతున్నారు. మరోవైపు కొత్తగా 26,895 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 96,63,382 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 95.69 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.45 శాతంగా ఉంది.
ఇక డిసెంబర్ 22 నాటికీ దేశంలో 16,42,68,721 కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లోనే 10,98,164 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. కొత్త పాజిటివ్ కేసులలో 77.34 శాతం 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుండే నమోదయ్యాయి. కేరళలో అత్యధికంగా 6,049, ఆతర్వాత మహారాష్ట్రలో 3,106 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ