కరోనా విజృంభణ: దేశంలో 3.5 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

Covid-19 India Updates, Coronavirus Cases In India, Coronavirus Deaths In India, Coronavirus Higlights, Coronavirus In India, Coronavirus in India live updates, Coronavirus Live Updates, Coronavirus news highlights, Coronavirus outbreak, coronavirus positive cases, Coronavirus Positive Cases In India, india coronavirus cases, india coronavirus deaths,Total Corona Cases In India

దేశంలో కొత్తగా 10,974 కరోనా పాజిటివ్ కేసులు, 2003 కరోనా మరణాలు నమోదయ్యాయి. జూన్ 17, బుధవారం ఉదయానికి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,54,065 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే కొత్తగా నమోదైన 2003 కరోనా మరణాల్లో ఒక్క మహారాష్ట్ర రాష్ట్రంలోనే 1409 మరణాలు నమోదు చేయబడ్డాయి. అయితే మహారాష్ట్రలో గత రెండు నెలలుగా పెండింగులో ఉంచిన కరోనా మరణాలను చేర్చడంతోనే ఈ సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తుంది. దీంతో కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు దేశంలో మరణించిన వారి సంఖ్య 11,903 కి చేరింది.

మొత్తం కరోనా బాధితుల్లో 1,86,935 మంది పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 1,55,227 మంది కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా తీవ్ర ప్రభావంతో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. కాగా దేశవ్యాప్తంగా చికిత్స తీసుకుంటున్న కరోనా బాధితుల సంఖ్య కంటే వైరస్ లక్షణాలు‌ నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అవుతున్న వారిసంఖ్య ఎక్కువుగా ఉండడం ఊరట కల్గిస్తుంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాత భారత్ 4వ స్థానంలో నిలిచింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 1 =