జూన్ 17, బుధవారం ఉదయానికి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,54,065 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 6,922 మంది కరోనా బాధితులు పూర్తిగా కోలుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్య 1,86,934 కు చేరింది. దీంతో రికవరీ రేటు 52.8 శాతానికి పెరిగింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో 1,55,227 మంది చికిత్స పొందుతున్నారు.
మరోవైపు దేశంలో కరోనా వైరస్ సోకిన వారిని పరీక్షించేందుకు పరీక్షల సామర్థ్యాన్ని భారతీయ వైద్య పరిశోధనామండలి (ఐసిఎంఆర్) మరింతగా పెంచింది. ప్రభుత్వ లేబరేటరీల (రియల్-టైమ్ ఆర్.టి-పి.సి.ఆర్, ట్రూ-నాట్, సి.బి-నాట్ ) సంఖ్య తాజాగా 674 కి చేరుకోగా, ప్రైవేట్ లాబొరేటరీస్ సంఖ్య 250 కి పెరిగింది. దీంతో కరోనా పరీక్షలు నిర్వహించే మొత్తం లాబ్స్ సంఖ్య 924 అయింది. కాగా గడిచిన 24 గంటల్లో 1,63,187 శాంపిల్స్ పరీక్షించారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 60,84,256 కు చేరింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu