వచ్చే ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ పలు రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితులపై దృష్టి సారించింది. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని మళ్ళీ ప్రజలకు చేరువ చేసే విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన చేస్తుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నల్లారి కిరణ్కుమార్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తుంది.
కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపుతో కిరణ్కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రెండు, మూడు రోజుల పాటుగా కిరణ్కుమార్ రెడ్డి ఢిల్లీలో గడపనునున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా సాకె శైలజానాథ్ వ్యవహరిస్తున్నారు. కిరణ్కుమార్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం చేసే చర్చల్లో పార్టీ బలోపేతం, పీసీసీ మార్పు సహా పలు అంశాలపై చర్చించే అవకాశముంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF