దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రోజువారీ కరోనా కేసులు 30 వేలకు దిగువకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 27,409 పాజిటివ్ కేసులు, 347 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఫిబ్రవరి 15, మంగళవారం ఉదయం 8 గంటల నాటికీ కరోనా కేసుల సంఖ్య 4,26,92,943 కు, మరణాల సంఖ్య 5,09,358 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక రోజువారీ పాజీటివిటీ రేటు 2.23 శాతంగా నమోదవగా, వీక్లి పాజీటివిటీ రేటు 3.63 శాతంగా ఉంది.
అలాగే దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. గత 24 గంటల వ్యవధిలో 82,817 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,17,60,458 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 97.82 శాతం గానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో ప్రస్తుతం 4,23,127 (0.99%) మంది చికిత్స పొందుతున్నారు. కాగా ప్రపంచంలో ఎక్కువ కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్ రెండో స్థానంలో, కరోనా మరణాలు ఎక్కువుగా నమోదైన దేశాల్లో మూడో స్థానంలో నిలిచింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ