దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. 715 రోజుల తర్వాత 1000 కంటే తక్కువగా రోజువారీ కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 913 పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,29,044 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో 13 మంది మరణించడంతో మరణాల సంఖ్య 5,21,358 కి పెరిగింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.76 శాతంగానూ, మరణాల రేటు 1.21 శాతంగా ఉంది. ప్రస్తుతం 12,597 (0.03%) మంది కరోనా బాధితులు హోం ఐసోలేషన్ లలో, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక దేశంలో కొత్తగా 1,316 కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,24,95,089 కు చేరుకుంది.
గత 24 గంటల్లో కేరళ (310), మహారాష్ట్ర (117), ఢిల్లీ (85), హర్యానా (54), కర్ణాటక (50), ఉత్తర్ ప్రదేశ్ (45), వెస్ట్ బెంగాల్ (36), ఒడిశా (36), మిజోరాం (34), తమిళనాడు (23) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఏప్రిల్ 4, సోమవారం ఉదయం 7 గంటల వరకు 184.70 కోట్ల (1,84,70,83,279) కరోనా వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ