మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనావైరస్ తీవ్రత రోజు రోజుకూ పెరుగుతుంది. ఇటీవల ఒకేరోజు వ్యవధిలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఆ రాష్ట్రంలో ఆగస్టు 30, ఆదివారం నాడు ఒక్కరోజే 16,408 కొత్త కేసులు నమోదుకాగా, 296 మంది మరణించారు. మహారాష్ట్రలో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో కరోనా మరణాలు చోటుచేసుకోవడం ఆందోళనగా మారింది. ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,80,689 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 24,399 కి పెరిగింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి 7,690 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు 5,62,401 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,93,548 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఆగస్టు 30 నాటికీ మహారాష్ట్రలో 40,92,620 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu