ఉస్మానియా ఆసుపత్రి భవనాల కూల్చివేత, నూతన భవన నిర్మాణంపై దాఖలైన పిటిషన్పై ఆగస్టు 30, సోమవారం నాడు హైకోర్టులో విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదిస్తూ పురాతన కట్టడమైన ఉస్మానియా ఆసుపత్రిని కూల్చివేయకుండా ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని, పక్కన ఉన్న16 ఎకరాల స్థలంలో నూతన భవనం నిర్మాణం చేపట్టేలా ఆదేశించాలని కోర్టును కోరారు. కాగా ఆసుపత్రి భవనం ఇప్పటికే శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో వాటిని కూల్చివేసి కొత్త భవనం నిర్మిస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇరువర్గాల వాదన విన్న కోర్టు, కొత్త భవన నిర్మాణానికి సంబంధించిన అన్ని వివరాలతో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే ఉస్మానియా ఆసుపత్రి యొక్క పూర్తి మ్యాప్ (సైట్ ప్లాన్) ను కోర్టుకు సమర్పించాలని చెప్పింది. ఈ అంశంపై తదుపరి విచారణను సెప్టెంబర్ 8 కి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu