ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 1, 2 తేదీల్లో వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ విడుదల చేశారు. సెప్టెంబర్ 1 మధ్యాహ్నం 3.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. 4.00 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడపకు బయలుదేరతారు. అనంతరం కడప విమానాశ్రయం నుంచి హెలికాఫ్టర్ లో ఇడుపులపాయ చేరుకొని, వైఎస్ఆర్ ఎస్టేట్ గెస్ట్ హౌస్ కు వెళ్తారు. సెప్టెంబర్ 2 వ తేదీ ఉదయం 9.45 గంటలకు వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకుంటారు. 9.50 నుంచి 10:30 గంటల వరకు వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. 10:30 గంటలకు తిరిగి వైఎస్ఆర్ ఎస్టేట్ గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. అనంతరం కడప విమానశ్రయంకు చేరుకొని 11:15 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరతారు. 12:30 గంటలకు సీఎం వైఎస్ జగన్ తిరిగి తాడేపల్లిలోని స్వగృహానికి చేరుకుంటారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu