దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. వ్యాక్సినేషన్ లో భాగంగా ఇప్పటివరకు ప్రజలకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 175 కోట్లు దాటింది. ఫిబ్రవరి 18, శనివారం ఉదయం 7 గంటల వరకు దేశంలో పంపిణీ చేసిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 175 కోట్లు ((1,75,03,86,834) దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కాగా గత 24 గంటల్లోనే 36.28 లక్షలమందికి పైగా (36,28,578) వ్యాక్సిన్ తీసుకున్నట్టు పేర్కొన్నారు.
మరోవైపు దేశంలో జనవరి 3వ తేదీ నుంచి 15 మరియు 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు/టీనేజర్లకు “కోవాక్జిన్” కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కేటగిరి కింద ఇప్పటివరకు 5,34,31,024 మందికి మొదటి డోసు, 2,06,81,828 మందికి రెండో డోస్ వ్యాక్సిన్ వేసినట్టు వెల్లడించారు. అలాగే జనవరి 10 నుంచి హెల్త్కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ కు మరియు 60 ఏళ్లు వయసుపైబడి కోమార్బిడిటీస్ ఉన్నవారికీ ప్రికాషన్ డోస్ అందిస్తున్నారు. ఇప్పటివరకు 40,22,962 మంది హెల్త్కేర్ వర్కర్స్, 57,83,690 మంది ఫ్రంట్లైన్ వర్కర్స్ మరియు 60 ఏళ్లు పైబడినవారు 88,93,489 మందికి కలిపి ప్రికాషన్ డోస్ కింద మొత్తం 1,75,03,86,834 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ