ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం మార్కాపురంలోని జార్జి ఇంజనీరింగ్ కాలేజీలో ఈరోజు మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో మంత్రి అస్వస్థతకు లోనయ్యారు. కళ్ళు తిరిగి ఒక్కసారిగా కిందపడిపోయారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే వైద్యులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే కాలేజీ వద్దకు చేరుకొని మంత్రికి చికిత్స అందించారు. ప్రస్తుతం మంత్రి సురేష్కు జార్జి ఇంజనీరింగ్ కాలేజీలోనే చికిత్స అందిస్తున్నామని, బిపి పడిపోవడం వల్లనే కళ్ళు తిరిగి పడిపోయారని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆయాసంతో కొంత ఇబ్బంది పడుతున్నారని, మరికొద్దిసేపట్లో కోలుకుంటారని వైద్యులు తెలిపారు. అయితే ఇటీవలే మంత్రి సురేష్ హైదరాబాద్ యశోద హాస్పిటల్లో యాంజియోగ్రామ్ నిర్వహించి స్టెంట్ చేయించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి మంత్రి అస్వస్థతకు గురవ్వడంతో అధికారులు కొంత ఆందోళన చెందారు. అయితే ప్రమాదమేమీ లేదన్న వైద్యుల ప్రకటనతో వారు ఊపిరి పీల్చుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY