కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ మరో మైలురాయిని దాటింది. దేశంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 7 కోట్లు దాటింది. దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా 45 ఏళ్లు పైబడినవారికి వారందరికీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 7 గంటల వరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 7.3 కోట్లు (7,30,54,295) దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.
ఇందులో 89,32,642 హెల్త్ కేర్ వర్కర్స్(మొదటి డోస్), 52,96,666 హెల్త్ కేర్ వర్కర్స్(సెకండ్ డోస్), 95,71,610 మంది ఫ్రంట్లైన్ వర్కర్స్ (మొదటి డోస్), 39,92,094 మంది ఫ్రంట్లైన్ వర్కర్స్ (రెండో డోసు), 4,45,77,337 మంది 45 ఏళ్లు పైబడినవారికీ (మొదటి డోసు), 6,83,946 మంది 45 ఏళ్లు పైబడినవారికీ (సెకండ్ డోసు) కరోనా వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు. మరోవైపు వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన 77వ రోజైన ఏప్రిల్ 2, శుక్రవారం నాడు ఒక్కరోజే 30.9 లక్షలకుపైగా ( 30,93,795) కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ చేసినట్లు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ