కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ మరో మైలురాయిని దాటింది. దేశంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 22 కోట్లు దాటింది. దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్, 45 ఏళ్లు పైబడినవారితో పాటుగా మే 1 నుంచి మూడో దశ వ్యాక్సినేషన్ లో భాగంగా 18-44 ఏళ్ల వారికి కూడా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 3, గురువారం ఉదయం 7 గంటల వరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 22 కోట్లు (22,10,43,693) దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వివరాలు (జూన్ 3, ఉదయం 7 గంటల వరకు):
- హెల్త్ కేర్ వర్కర్స్ (మొదటి డోసు) : 99,12,522
- హెల్త్ కేర్ వర్కర్స్ (రెండో డోసు) : 68,15,468
- ఫ్రంట్లైన్ వర్కర్స్ (మొదటి డోసు) : 1,58,49,178
- ఫ్రంట్లైన్ వర్కర్స్ (రెండో డోసు) : 85,84,162
- 18-44 ఏళ్ల వయసు వారు (మొదటి డోసు): 2,26,12,866
- 18-44 ఏళ్ల వయసు వారు (రెండో డోసు): 59,283
- 45-60 ఏళ్ల వయసు వారు (మొదటి డోసు): 6,78,84,028
- 45-60 ఏళ్ల వయసు వారు (రెండో డోసు): 1,09,73,523
- 60 ఏళ్లు పైబడినవారు (మొదటి డోసు): 5,94,06,566
- 60 ఏళ్లు పైబడినవారు (రెండో డోసు): 1,89,46,097
- మొత్తం అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య : 22,10,43,693
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ