అతి తీవ్ర తుఫాన్ గా మారిన “అంఫాన్“ ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు తీరాన్ని తాకింది. సుందర్బన్ నుంచి పశ్చిమ బెంగాల్లో తీరాన్ని తాకినట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు వెల్లడించారు. తుఫాన్ తీరాన్ని తాకడం ప్రారంభమయ్యాక ఈ పక్రియ సుమారు నాలుగు గంటల పాటు కొనసాగుతుందన్నారు. దీంతో ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ లోని కొన్ని తీర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది.
తుఫాను క్రమంగా బలహీనపడుతుండటంతో, ఒడిశాలో దీని ప్రభావం తక్కువగా ఉండే అవకాశముందని ఐఎండీ అధికారులు తెలిపారు. అయినప్పటికీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గంటకు 170-200 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో ముందుగానే బాలసోర్, జగత్సింగ్పూర్, కేంద్రపారా, భద్రక్ వంటి తీరప్రాంత జిల్లాల ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. పశ్చిమ బెంగాల్ లో కూడా ప్రభావిత జిలాల్లో ప్రజలను ఖాళీ చేయించి, తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు ఒడిశా, బెంగాల్ లోని ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. అంఫాన్ తుపాను కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినే అవకాశం ఉండటంతో శాటిలైట్ పోన్ల ద్వారా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అనుసంధానమై సహాయక చర్యలు చేపట్టనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu