ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనాతో ఎదురవుతున్న సమస్యలపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యగ్యంగా ట్వీట్ చేశారు. “ఎల్జీ నన్ను రోజూ తిట్టినంతగా, నా భార్య కూడా నన్ను తిట్టదు. గత ఆరు నెలల్లో ఎల్జీ నాకు రాసినన్ని ప్రేమ లేఖలు నా భార్య కూడా రాయలేదు. ఎల్జీ కాస్త శాంతించండి. మీ సూపర్ బాస్ కు కూడా చెప్పి కాస్త శాంతంగా ఉండమని చెప్పండి” అని అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా సక్సేనా నియమితులైనప్పటి నుంచి వీరిద్దరి మధ్య కలహాలు కొనసాగుతూనే ఉన్నాయి. పలు అంశాలపై విచారణ కోరడం సహా అనేక అంశాలను ప్రస్తావిస్తూ సక్సేనా వరుసగా కేజ్రీవాల్ కు లేఖలు రాస్తున్నారు. ఇటీవల మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాజ్ఘాట్ లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరుకాకపోవడంపై కూడా సక్సేనా లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే సక్సేనాపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యగ్యంగా స్పందించినట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY