కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికవడం ఇది వరుసగా రెండోసారి. తెలంగాణకు చెందిన నుంచి సురవరం సుధాకర్ రెడ్డి తర్వాత 2019, జూలైలో తొలిసారిగా డి.రాజా సీపీఐ పగ్గాలు చేపట్టారు. ఇక అక్టోబర్ 14 నుంచి 18 వరకు ఏపీలోని విజయవాడలో జరిగిన 24వ పార్టీ కాంగ్రెస్ చివరి రోజున, తమిళనాడుకు చెందిన డి.రాజా వరుసగా రెండోసారి సీపీఐ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే 11 మంది సభ్యులతో కొత్త నేషనల్ సెక్రటేరియట్, 31 మంది కొత్త నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్, 125 మంది కొత్త నేషనల్ కౌన్సిల్ మెంబెర్స్ ను కూడా ఈ 24వ జాతీయ మహాసభల్లో ఎన్నుకున్నారు.
అనంతరం డి.రాజా మీడియాతో మాట్లాడుతూ, 2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై పోరాడేందుకు సీపీఐ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తుందని చెప్పారు. ఉమ్మడి లక్ష్యాన్ని సాధించే దిశగా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు సహా అన్ని లౌకిక ప్రజాస్వామ్య శక్తుల మధ్య ఐక్యతను తీసుకురావడానికి కృషి చేస్తామని డి.రాజా పేర్కొన్నారు.
సీపీఐ కొత్త నేషనల్ సెక్రటేరియట్ మెంబెర్స్:
- డి.రాజా
- కనం రాజేంద్రన్
- అతుల్ కుమార్ అంజాన్
- అమర్జీత్ కౌర్
- కె.నారాయణ
- డాక్టర్ బికె కాంగో
- బినోయ్ విశ్వం
- పల్లబ్ సేన్గుప్తా
- నాగేంద్రనాథ్ ఓజా
- అజీజ్ పాషా
- రామకృష్ణ పాండా.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY