సీఎం కేసీఆర్ ను కలిసిన వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్, పలు రాష్ట్రాల నాయకులు

VCK Party Chief Thirumavalavan and Leaders of Several States Met CM KCR at Pragati Bhavan, VCK Party Chief Thirumavalavan, Telangana CM KCR , Leaders of Several States Met CM KCR, Mango News, Mango News Telugu, Pragati Bhavan, VCK Party, Viduthalai Chiruthaigal Katchi, Viduthalai Chiruthaigal Katchi Party Chief, CM KCR Met Leaders At Pragati Bhavan, CM KCR Latest News And Updates, CM KCR, VCK Party News And Latest Updates

భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరుతో జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన సందర్భంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును గురువారం ప్రగతిభవన్ లో తమిళనాడు ఎంపీ, ప్రముఖ దళిత నేత, వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్ సహా పలు రాష్ట్రాల నాయకులు కలిశారు. సీఎం కేసీఆర్ ను కలిసిన వారిలో వివిధ రాష్ట్రాల రైతు నాయకులు రాకేశ్ రఫీక్, అక్షయ్ (ఒడిషా), సంయుక్త కిసాన్ మోర్చా నాయకుడు గుర్నామ్ సింగ్ (హర్యానా), మహారాష్ట్ర రైతు నాయకుడు దశరథ్ సావంత్, సీనియర్ జర్నలిస్టు వినీత్ నారాయణ (ఢిల్లీ) తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణలో దళితుల అభివృద్ది కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని, తెలంగాణ స్పూర్తితో దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం వుందన్నారు. త్వరలోనే హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వున్న దళిత సోదరులతో దళిత్ కాంక్లేవ్ నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు తమిళనాడు ఎంపీ తిరుమావళవన్ శాలువా కప్పి సన్మానించారు. అనంతరం తిరుమావళన్ మాట్లాడుతూ, తెలంగాణలో దళితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాల గురించి తెలుసుకున్నానని, దళితుల కోసం ఇన్ని పథకాలు మరే రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని ప్రశంసించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − four =