సీఎం కేసీఆర్‌, కేఏ పాల్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్

Telangana BJP President Bandi Sanjay Sensational Comments on CM KCR and KA Paul, Bandi Sanjay Comments on CM KCR and KA Paul, Bandi Sanjay Comments on KCR BRS Party, Bandi Sanjay Sensational Comments On KCR, Mango News, Mango News Telugu, Telangana BJP President Bandi Sanjay, Telangana CM KCR, BJP President Bandi Sanjay, Telangana BJP Chief Bandi Sanjay, TRS Name Changes To BRS, TRS Party, BRS Party Latest News And Live Updates, BRS Party Chief KCR, KA Paul

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరియు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ నాయకుల్లో సొంత విమానాలు కొన్నది ఇద్దరేనని, వారు సీఎం కేసీఆర్‌, కేఏ పాల్‌ అని ఆయన అన్నారు. వారి మధ్య ఉన్న ఈ సారూప్యత కారణంగా భవిష్యత్‌లో వారిద్దరూ అలయెన్స్‌ పెట్టుకునే ఛాన్స్ కూడా ఉందని బండి సంజయ్ అన్నారు. సీఎం కేసీఆర్‌ ఇప్పుడు ఎందుకు కొత్త పార్టీ పెడుతున్నారని, మునుగోడులో ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారని సంజయ్‌ ప్రశ్నించారు.

అసలు సీఎం కేసీఆర్‌ ప్రకటించిన పార్టీకి జెండా, ఎజెండా లేవని, ‘భారత్‌ రాష్ట్ర సమితి’ అంటే అర్థమేంటో వివరించాలని బండి కోరారు. కొడుకును ముఖ్యమంత్రిని చేయడానికే సీఎం కేసీఆర్‌ కొత్త పార్టీ పెట్టారని, అలాగే కుమార్తెకు ఢిల్లీలో ఏదొక పదవి ఇప్పించడానికే ఈ ప్రయత్నాలని ఆయన ఎద్దేవా చేశారు. దళితులపై కపట ప్రేమను చూపిస్తున్న కేసీఆర్, రాష్ట్రపతిగా ఒక ఎస్టీ మహిళ పోటీ చేస్తుంటే మద్దతు ఇవ్వకపోగా ప్రతిపక్షాలతో కలిసి ఆమె ఓటమికి ప్రయత్నించారని మండిపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఎంతమందికి ‘దళితబంధు’ ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =