ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నమోదు చేసిన కేసులో ఐదుగురు నిందితులకు రోస్ ఎవెన్యూలోని కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్, అరుణ్ రామచంద్ర పిళ్లై, సమీర్ మహేంద్రు, ముత్తా గౌతమ్లకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎంకే నాగ్పాల్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులో ముత్తా గౌతమ్ మినహా మిగతా నిందితులు జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు. గతంలో ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్లకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ముత్తా గౌతమ్, అరుణ్ పిళ్లై, వ్యాపారవేత్త సమీర్ మహేంద్రులకు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కానీ వీరు ఈడీ దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ పాలసీ కేసులో వ్యాపారవేత్త సమీర్ మహేంద్రు జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగనున్నారు. మరో ఇద్దరు నిందితులు విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్పల్లికి ఇదే కోర్టు గతంలో బెయిల్ మంజూరు చేసింది. అయితే, విజయ్ నాయర్ మరియు అభిషేక్ బోయిన్పల్లి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఎందుకంటే వారిని ఈ కేసులో ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం వారి బెయిల్ పిటిషన్ ట్రయల్ కోర్టులో పెండింగ్లో ఉంది. ఇక ఇదే కేసుకి సంబంధించి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ ఆదివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అలాగే ఆయనను మార్చి 4 వరకు ఐదు రోజుల రిమాండ్కు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE