ఢిల్లీ మంత్రులు మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ లు కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. దీంతో వీరి రాజీనామాలను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆమోదించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు విచారణలో భాగంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సెంట్రల్ సీబీఐ) అరెస్టు విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఐదు రోజుల సీబీఐ రిమాండ్లో ఉన్నారు. అలాగే మనీ లాండరింగ్ ఆరోపణలతో సత్యేంద్ర జైన్ కూడా ఇప్పటికే తీహార్ జైలులో ఉన్నారు. ఇరువురిపై అవినీతి ఆరోపణలు వచ్చి, అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్నా కూడా పదవుల్లో కొనసాగడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలోనే ఈ రాజీనామాలు చోటుచేసుకున్నాయి.
ఢిల్లీ మంత్రివర్గం నుండి మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ రాజీనామాల అనంతరం, మంత్రి కైలాష్ గహ్లాట్కు ఆర్థిక, ప్రణాళిక, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, పవర్, హోమ్, అర్బన్ డెవలప్మెంట్, ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్ మరియు వాటర్ డిపార్ట్మెంట్స్ ను అప్పగించారు. అలాగే మంత్రి రాజ్ కుమార్ అన్నాడ్ కు విద్య, ల్యాండ్ అండ్ బిల్డింగ్, విజిలెన్స్, సేవలు, పర్యాటకం, ఆర్ట్ కల్చర్ అండ్ లాంగ్వేజ్, కార్మిక, ఉపాధి, ఆరోగ్యం మరియు పరిశ్రమల శాఖలను కేటాయించారు. మరోవైపు మనీశ్ సిసోడియా తన అరెస్ట్ పై మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ దశలో మనీష్ సిసోడియా అరెస్టులో జోక్యం చేసుకోవడానికి సీజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు బెంచ్ నిరాకరించింది. ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని బెంచ్ సూచించింది. దీంతో మనీశ్ సిసోడియాను ముందుగా హైకోర్టులో పిటిషన్ వేయాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE