తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం కామారెడ్డి జిల్లా, బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండలం తిమ్మాపూర్ లో పర్యటించనున్నారు. తిమ్మాపూర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 26వ తేదీ నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా, బుధవారం నిర్వహించనున్న వెంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. తిమ్మాపూర్ లో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ జితేశ్వి పాటిల్, సంబంధిత అధికారులు ఏర్పాట్లని పర్యవేక్షించారు.
ముందుగా బుధవారం ఉదయం 9.50 గంటలకు ప్రగతిభవన్ నుంచి సీఎం కేసీఆర్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని, అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి బాన్సువాడలో ఏర్పా టు చేసిన హెలీప్యాడ్ వద్దకు 10.40 గంటలకు చేరుకోనున్నారు. అనంతరం తిమ్మాపూర్ లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయానికి చేరుకొని, బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. అక్కడ జరగనున్న కృతజ్ఞత సభలో కూడా సీఎం పాల్గొంటారు. ఇక ఈ కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం నుంచి సీఎం కేసీఆర్ హైదరాబాద్ కు తిరుగుపయనం కానున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE