దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. అయితే పాజిటివ్ కేసులు నమోదు తగ్గినప్పటికీ మరణాలు మాత్రం పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 10, గురువారం నాడు కూడా 1575 కరోనా కేసులు, 61 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,01,150 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 9,874 కి పెరిగింది.
ఇక కొత్తగా కోవిడ్ నుంచి 3,307 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 5,72,523 కు చేరుకుంది. ఢిల్లీలో కరోనా రికవరీ రేటు 95.2 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.6 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 18,753 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు మంగళవారం నాటికీ ఢిల్లీ నగరంలో 69,41,407 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ