దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. అయితే పాజిటివ్ కేసులు నమోదు తగ్గినప్పటికీ మరణాలు ఎక్కువుగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 15, మంగళవారం నాడు కూడా 1617 కరోనా కేసులు, 41 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,10,447 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 10,115 కి పెరిగింది.
ఇక కొత్తగా కోవిడ్ నుంచి 2343 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 5,85,852 కు చేరుకుంది. ఢిల్లీలో కరోనా రికవరీ రేటు 95.9 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.66 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 14,480 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు మంగళవారం నాటికీ ఢిల్లీ నగరంలో 73,71,952 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ