కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 23, 2020 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసులపై రద్దు కొనసాగుతుండగా, తాజాగా మరోసారి రద్దు గడువును పొడిగిస్తూ డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్ణయం తీసుకుంది. కమర్షియల్ ప్యాసింజర్ విమానాలపై నిషేధం విధిస్తూ జూన్ 26, 2020 న ఇచ్చిన ఉత్తర్వులకు పాక్షిక సవరణ చేస్తూ మార్చి 31 అర్ధరాత్రి 23.59 గంటల వరకు అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లుగా ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే అంతర్జాతీయ కార్గో విమానాలకు, డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించే విమానాలకు ఈ నిబంధనలు వర్తించవని స్పష్టం చేశారు. ఇక వందే భారత్ మిషన్లో భాగంగా ఎంపిక చేసిన కొన్ని దేశాలకు విమాన సర్వీసులు కొనసాగించే అవకాశం ఉందని తెలిపారు.
— DGCA (@DGCAIndia) February 26, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ