అల్లోపతి వైద్యంపై యోగా గురువు రామ్దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నేడు (జూన్ 1, మంగళవారం) దేశవ్యాప్తంగా వైద్యులంతా ‘బ్లాక్ డే’ పాటించాలని ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఎఫ్ఓఆర్డీఏ) పిలుపునిచ్చింది. “రామ్దేవ్ బాబా వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆరోగ్య సంరక్షణ సేవలకు ఆటంకం కలిగించకుండా, జూన్ 1, 2021 న కార్యాలయాల్లోనే దేశవ్యాప్తంగా బ్లాక్డే నిరసన ప్రకటిస్తున్నాం” అని ఎఫ్ఓఆర్డీఏ ప్రకటించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వైద్యులంతా పని చేస్తున్న ప్రదేశాల్లోనే నల్ల బ్యాడ్జ్లు ధరించి బ్లాక్ డే పాటిస్తున్నారు.
ముందుగా అల్లోపతి వైద్యం, కరోనా వారియర్స్ పై రామ్దేవ్ బాబా అశాస్త్రీయ, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఎఫ్ఓఆర్డీఏ పేర్కొంది. ఆ వ్యాఖ్యలపై ఆయన బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం లేదా ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 కింద ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని ఎఫ్ఓఆర్డీఏ ప్రకటించింది. మరోవైపు ఎఫ్ఓఆర్డీఏ పిలుపునిచ్చిన ఈ బ్లాక్ డే నిరసనకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) కూడా మద్దతు తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ