ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీహెఛ్ ద్వారకా తిరుమలరావును నియమిస్తూ మే 31, సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్న ఆర్పీ ఠాకూర్ సోమవారం నాడు పదవి విరమణ పొందడంతో ఆ స్థానంలో రైల్వే డీజీగా ఉన్న తిరుమలరావును నియమించారు. అలాగే ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా ఎన్.సంజయ్ నియమితులు అయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ