దేశంలో ఇటీవలే ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా, బీహార్, ఛత్తీస్ గడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న పలు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తర్ ప్రదేశ్/యూపీలో ఖాళీగా ఉన్న మరో అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నిర్ణయించింది. ఈ మేరకు యూపీలోని ఖతౌలీ అసెంబ్లీ స్థానానికి మంగళవారం ఉపఎన్నిక షెడ్యూల్ ను ఈసీ ప్రకటించింది. 2013 ముజఫర్నగర్ అల్లర్ల కేసులో దోషిగా తేలిన బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్సింగ్ సైనీపై అనర్హత వేటు వేయడంతో ఖతౌలీ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో ఖతౌలీలో డిసెంబర్ 5వ తేదీన పోలింగ్ జరగనుందని ఈసీ తెలిపింది. కాగా ఈ ఖతౌలీ ఉపఎన్నిక కౌంటింగ్ పక్రియను హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్, ఇతర ఉపఎన్నికల కౌంటింగ్ తో పాటుగా డిసెంబర్ 8న చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నట్టు పేర్కొన్నారు.
ఖతౌలీ ఉపఎన్నిక షెడ్యూల్ వివరాలు:
- గెజిట్ నోటిఫికేషన్ జారీ తేదీ: నవంబర్ 10
- నామినేషన్ల దాఖలుకు ఆఖరి తేదీ: నవంబర్ 17
- నామినేషన్ల పరిశీలన: నవంబర్ 18
- నామినేషన్ల ఉపసంహరణ గడువు: నవంబర్ 21
- పోలింగ్ తేదీ: డిసెంబర్ 5
- ఓట్ల లెక్కింపు పక్రియ: డిసెంబర్ 8.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE