ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథీలో నేడు (గురువారం) జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కాంగ్రెస్, ఎస్పీ లపై విరుచుకుపడ్డారు. ఈ కుటుంబాలకు దేశ ప్రజలు చాలా కాలంగా విధేయులుగా ఉన్నారు. కానీ మీరు వారికి ఓటు వేసిన మరుక్షణమే వారు మిమ్మల్ని మర్చిపోతారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండుంటే వ్యాక్సిన్లను అమ్ముకునేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ, తమ ప్రభుత్వం మాత్రం ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్స్ ను ఉచితంగా అందించినట్టు చెప్పారు. 2019 లోక్సభ ఎన్నికల్లో అమేథీ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ కి చెందిన స్మృతి ఇరానీ భారీ మెజారిటీతో గెలుపొందారు. 1988 తర్వాత కాంగ్రెస్ ఈ సీటును కోల్పోవడం ఇదే తొలిసారి. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గతంలో మూడుసార్లు గెలిచారు. కాగా, అమేథీ నియోజకవర్గంలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 27న ఐదవ దశ పోలింగ్ జరగనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ