తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యునిగా నిర్మాత, పారిశ్రామికవేత్త దాసరి కిరణ్ కుమార్ ను నియమిస్తూ ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాసరి కిరణ్ కుమార్ సోమవారం టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత ఆలయ డిప్యూటీ ఈవో రమేష్బాబు దాసరి కిరణ్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం దాసరి కిరణ్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఆతర్వాత రంగనాయకుల మండపంలో ఆయనకు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు, అలాగే టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బోర్డు సెల్ డిప్యూటీ ఈవో కస్తూరి బాయి, పేష్కార్ శ్రీహరి, పారుపత్తేదార్ తులసీప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE