భారత్, ఇంగ్లాండ్ జట్ల మార్చ్ 12 నుంచి మార్చ్ 20 వ తేదీ వరకు 5 టీ20ల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ20ల్లో భారత్ తో తలపడే 16 మంది ఆటగాళ్లతో కూడిన ఇంగ్లాండ్ జట్టును ఈసీబీ గురువారం నాడు ప్రకటించింది. కరోనా నేపథ్యంలో ఐదు టీ20 లను కూడా అహ్మదాబాద్లోని సర్దార్ పటేల్ స్టేడియంలోనే నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. టీ20ల్లో ఇంగ్లాండ్ కెప్టెన్ గా ఇయాన్ మోర్గాన్ వ్యవహరించనున్నాడు. టీ20ల కోసం ఎంపిక చేయబడ్డ మిగతా ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఫిబ్రవరి 26న భారత్కు చేరుకోనున్నారు.
ఇంగ్లాండ్ టీ20 జట్టు:
- ఇయాన్ మోర్గాన్(కెప్టెన్)
- జేసన్ రాయ్
- బెన్ స్టోక్స్
- బెయిర్స్టో
- సామ్ బిల్లింగ్స్
- మొయిన్ అలీ
- జోఫ్రా ఆర్చర్
- జోస్ బట్లర్
- శామ్ కరన్
- టామ్ కరన్
- క్రిస్ జోర్డాన్
- లియామ్ లివింగ్స్టోన్
- డేవిడ్ మలన్
- అదిల్ రషీద్
- టాప్లే
- మార్క్ వుడ్
- రిజర్వడ్ ఆటగాళ్లు: జాకే బాల్, మట్ పార్కిన్సన్
భారత్ Vs ఇంగ్లాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్:
- మొదటి టీ20 – మార్చి 12 – అహ్మదాబాద్
- రెండవ టీ20 – మార్చి 14 – అహ్మదాబాద్
- మూడవ టీ20 – మార్చి 16 – అహ్మదాబాద్
- నాలుగవ టీ20 – మార్చి 18 – అహ్మదాబాద్
- ఐదవ టీ20 – మార్చి 20 – అహ్మదాబాద్
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ