ప్రముఖ హిందీ టెలివిజన్ నటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయస్సు 46 సంవత్సరాలు. సిద్ధాంత్ శుక్రవారం జిమ్లో వ్యాయామం చేస్తున్నప్పుడు గుండెపోటుతో కుప్పకూలి తుదిశ్వాస విడిచినట్టుగా తెలుస్తుంది. అతనికి భార్య అలెసియా రౌత్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మోడల్గా తన కెరీర్ను ప్రారంభించిన సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ, క్కుసుమ్తో టెలివిజన్ లో నటుడిగా అరంగేట్రం చేశాడు. క్కుసుమ్, వారిస్, సూర్యపుత్ర కర్ణ్ వంటి టీవీ సీరియల్స్లో తన పాత్రల ద్వారా ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు పొందాడు.
అలాగే కసౌతి జిందగీ కే, కృష్ణ అర్జున్, క్యా దిల్ మే హై, క్యున్ రిష్టన్ మే కట్టి బత్తి మరియు జిద్ది దిల్ వంటి పలు టెలివిజన్ సీరియల్స్ లోప్రధాన పాత్రలు కూడా పోషించాడు. సిద్ధాంత్ మృతి పట్ల పలువురు తోటి నటీ నటులు, సినీ ప్రముఖలు, సన్నిహితులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతకొంత కాలంగా చిత్ర, టీవీ పరిశ్రమలో తక్కువ వయస్సు ఉన్నవారే గుండెపోటుతో మరణిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ ఇదేరీతిన మృతి చెందడంతో హిందీ టెలివిజన్ పరిశ్రమలో విషాదం నెలకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE