జనవరి 1, 2021 నుండి దేశంలోని అన్ని 4 చక్రాల వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫాస్టాగ్ ద్వారా డిసెంబర్ 24, బుధవారం నాడు రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 50 లక్షల ఫాస్టాగ్ లావాదేవీలు జరగడంతో టోల్ వసూలు మొదటిసారిగా 80 కోట్ల రూపాయలు దాటినట్టు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ప్రకటించింది. ఫాస్టాగ్ ద్వారా ఒక్కరోజులోనే రూ.80 కోట్లు వసూలు అవ్వడాన్ని చారిత్రక మైలురాయిగా అభివర్ణించారు. ఇప్పటి వరకు మొత్తం 2.20 కోట్ల ఫాస్టాగ్లను జారీ చేసినట్టు తెలిపారు.
దేశంలో టోల్గేట్ల వద్ద ట్రాఫిక్ను నియంత్రించడంతో పాటుగా డిజిటల్, ఐటి ఆధారిత చెల్లింపులను ప్రోత్సహించే లక్ష్యంతో 2016 లో ఫాస్టాగ్స్ ప్రారంభించబడ్డాయి. ఫాస్టాగ్ ద్వారా ప్రయాణికులు నగదు చెల్లింపుల కోసం టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేదని, ఈ విధానం సమయం మరియు ఇంధనాన్ని కూడా ఆదా చేస్తుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అన్ని 4 చక్రాల వాహనాలకు జనవరి 1 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి చేయడంతో దేశంలో అన్ని టోల్ ప్లాజాల వద్ద ఎన్హెచ్ఏఐ ఇప్పటికే అన్ని అవసరమైన ఏర్పాట్లు చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ