ఈ ఏడాది భారతదేశపు టాప్-10 ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి మొదటి స్థానంలో నిలిచారు. అలాగే ఈ జాబితాలో 2021లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, శివ నాడార్ ఆ స్థానాలను మళ్ళి నిలబెట్టుకున్నారు. మరోవైపు ముకేశ్ అంబానీ 90.7 బిలియన్ల డాలర్ల నికర విలువతో ఆసియాలో అత్యంత సంపన్నుడిగా నిలవడమే కాకుండా, ప్రపంచంలోని పదవ అత్యంత సంపన్న వ్యక్తిగా తన స్థానాన్ని నిలుపుకున్నారు.
ఇక 2022 ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలోన్ మస్క్ (219 బిలియన్ డాలర్లు), జెఫ్ బెజోస్ (171 బిలియన్ డాలర్లు), బెర్నార్డ్ ఆర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ (158 బిలియన్ డాలర్లు), బిల్ గేట్స్ (129 బిలియన్ డాలర్లు), వారెన్ బఫ్ఫెట్ (118 బిలియన్ డాలర్లు) మొదటి 5 స్థానాల్లో నిలిచారు.
ఫోర్బ్స్ జాబితా ప్రకారం టాప్-10 భారతదేశపు ధనవంతుల జాబితా:
1. ముకేశ్ అంబానీ – 90.7 బిలియన్ డాలర్లు
2. గౌతమ్ అదానీ – 90 బిలియన్ డాలర్లు
3. శివ నాడార్ – 28.7 బిలియన్ డాలర్లు
4. సైరస్ పూనవల్లా – 24.3 బిలియన్ డాలర్లు
5. రాధాకిషన్ దమాని – 20 బిలియన్ డాలర్లు
6. లక్ష్మి మిట్టల్ – 17.9 బిలియన్ డాలర్లు
7. సావిత్రి జిందాల్ – 17.7 బిలియన్ డాలర్లు
8. కుమార్ బిర్లా – 16.5 బిలియన్ డాలర్లు
9. దిలీప్ శాంఘ్వీ – 15.6 బిలియన్ డాలర్లు
10. ఉదయ్ కోటక్ – 14.3 బిలియన్ డాలర్లు
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ