దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సైతం వైరస్ బారినపడుతున్నారు. తాజాగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ అధినేత కెప్టెన్ అమరిందర్ సింగ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా స్వయంగా ప్రకటించారు.
“తేలికపాటి లక్షణాలతో నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నాను. ఇటీవల నన్ను సంప్రదించిన ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని అభ్యర్థిస్తున్నాను” అని కెప్టెన్ అమరిందర్ సింగ్ ట్వీట్ చేశారు. కాగా గత రెండ్రోజుల్లోనే కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు సినీ ప్రముఖులు కరోనా బారినపడ్డారు.
I have tested positive for #Covid with mild symptoms. Have isolated myself and request all those who came in contact with me to get themselves tested.
— Capt.Amarinder Singh (@capt_amarinder) January 12, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ