సీనియర్ ఐపీఎస్ వీసీ సజ్జనార్ తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనదైన మార్కుని చూపిస్తున్నారు. ఆయనే స్వయంగా బస్సుల్లో ప్రయాణిస్తూ ఆర్టీసీ పనితీరును పరిశీస్తున్నారు. అదేవిధంగా వినూత్న నిర్ణయాలతో ముందుకు వెళ్లుతూ ఆర్టీసీ ని లాభాల బాట పట్టించటానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రయాణీకుల సమస్యలపై వెంటనే స్పందిస్తున్నారు. తాజాగా, అర్ధరాత్రి టీఎస్ఆర్టీసీకి ఓ యువతి ట్వీట్ చేయగా ఎండీ వీసీ సజ్జనార్ వెంటనే స్పందించారు.
అర్ధరాత్రి సమయాల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల సౌకర్యం కోసం (బాత్ రూమ్స్) బస్సులను ఎక్కడైనా పెట్రోల్ బంక్స్ వద్ద ఒక 10 నిమిషాలు ఆపాలని పాలే నిషా అనే ఓ యువతి ట్విటర్లో కోరింది. బయటకి చెప్పుకోలేని సమస్యల వల్ల దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే మహిళలు ఇబ్బందులు పడుతున్నారని తెలియజేసింది. అర్ధరాత్రి చేసిన ఆమె ట్వీట్కి ఎండీ సజ్జనార్ వెంటనే స్పందించారు. ఈ విషయంపై అధికారులకు సూచించినట్లు వెంటనే నిషాకు రీట్వీట్ చేశారు. అర్ధరాత్రి సైతం ఒక మహిళ సమస్యపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించడంతో.. సదరు యువతి పాలే నిషా ఆనందం వ్యక్తం చేసి, కృతజ్ఞతలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ