పంజాబ్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్ లో విజయం కోసం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన ప్రచారాన్ని ముమ్మరం చేయగా, పలువురు కీలక వ్యక్తులు బీజేపీ పార్టీలో చేరుతున్నారు. ఈ క్రమంలో డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ స్టార్, ప్రొఫెషనల్ రెజ్లర్, ది గ్రేట్ ఖలీగా పిలువబడే దలీప్ సింగ్ రాణా గురువారం నాడు బీజేపీలో చేరారు. దేశ రాజధాని ఢిల్లీలోని బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో రాజ్యసభ ఎంపీ అరుణ్ సింగ్, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్, లోక్సభ ఎంపీ సునీతా దుగ్గల్ సమక్షంలో ది గ్రేట్ ఖలీ బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ది గ్రేట్ ఖలీ బీజేపీలో చేరడంతో, యువతతో పాటు దేశంలోని ఇతర ప్రజలకు స్ఫూర్తినిస్తుందని అన్నారు. అలాగే ఖలీ మాట్లాడుతూ బీజేపీలో చేరినందుకు సంతోషం వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న కృషి ఆయనను సరైన ప్రధానిని చేసిందని భావిస్తున్నానన్నారు. దీంతో దేశ అభివృద్ధి కోసం ప్రధాని మోదీ పాలనలో భాగం కావాలని ఆలోచించానని, అలాగే బీజేపీ జాతీయ విధానంతో కూడా ప్రభావితమైన తర్వాతే పార్టీలో చేరానని రెజ్లర్ ఖలీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ