జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మరోసారి నిధులు విడుదల చేసింది. 7వ విడతలో భాగంగా 23 రాష్ట్రాలకు రూ.5,516.60 కోట్లు, శాసనసభ కలిగిఉన్న 3 కేంద్రపాలిత ప్రాంతాలకు (ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్, పుదుచ్చేరి) లకు రూ.483.40 కోట్లు కలిపి మొత్తం రూ.6000 కోట్లు విడుదల చేయబడ్డాయి. జీఎస్టీ అమలు కారణంగా ఆదాయంలో తలెత్తే రూ.1.10 లక్షల కోట్ల కొరతను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ నుంచి ప్రత్యేక రుణాలు తీసుకునే విండోను ఏర్పాటు చేసింది. ఈ విధానం కింద ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రభుత్వాలకు కలిపి కేంద్రం రూ.42 వేల కోట్ల రుణాన్ని అందించింది. ఇక 7 విడతల్లో తెలంగాణ రాష్ట్రానికి మొత్తం రూ.559.02 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కు రూ.1055.79 కోట్లు విడుదల అయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ