ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన డిసెంబర్ 18, శుక్రవారం ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలోని ఒకటో బ్లాకులో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేబినెట్ భేటీలో చర్చించే అంశాలపై త్వరగా అన్ని శాఖలు ప్రతిపాదనలు పంపాలని ఆయా శాఖల అధికారులను సీఎస్ నీలం సాహ్ని ఆదేశించారు.
ఈ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా నివర్ తుపాను వలన నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల, ఈ నెల 25 న జరగనున్న ఇళ్ల పట్టాల పంపిణీ పథకం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు సహా రాష్ట్రంలో అమలు చేయనున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలుపై కీలకంగా చర్చించనున్నట్లు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ