తెలంగాణలో సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ మరియు కేరళ వైద్యుడు జగ్గుస్వామికి ఊరట లభించింది. వీరిద్దరికీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) జారీ చేసిన నోటీసులపై స్టే విధించింది. సిట్ ఇచ్చిన 41ఏ సీఆర్పీసీ నోటీసులపై ఈనెల 13 వరకు హైకోర్టు స్టే విధించింది. అలాగే దీనిపై తదుపరి విచారణను ఈనెల 13 వరకు హైకోర్టు వాయిదా వేసింది. కాగా తొలుత ఈ కేసులో బీఎల్ సంతోష్ మరియు జగ్గుస్వామికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. నవంబర్ 21న ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్ కమాండ్ కంట్రోల్లోని సిట్ కార్యాలయంలో వారు హాజరు కావాలని కోరారు. అయితే వీరు గైర్హాజరయ్యారు. దీంతో హైకోర్టు సూచనతో విచారణకు రావాలంటూ సిట్ అధికారులు సంతోష్కు నోటీసులు జారీ చేశారు. అలాగే జగ్గుస్వామిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై వారు కోర్టుని ఆశ్రయించగా తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు అరెస్ట్ చేయరాదని సిట్కు హైకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది. ఇక దీనిపై ఈరోజు విచారించిన హైకోర్టు వారిరువురికీ సిట్ జారీ చేసిన నోటీసులపై స్టే విధించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE