కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్రూపానీ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఇటీవల తన నియోజక వర్గంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై చర్చించడానికి ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేదవాలా మరో ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి సీఎం విజయ్రూపానీని, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, మంత్రి ప్రదీప్ సిన్హా జడేజాలను కలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే ఇమ్రాన్కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో ముందు జాగ్రత్త చర్యగా సీఎం విజయ్రూపానీ స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశానికి మంత్రులు కూడా హాజరు కావడంతో గుజరాత్ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
‘సీఎం ఆరోగ్యంగానే ఉన్నారు, వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించి ప్రస్తుతం లక్షణాలు లేవని ధృవీకరించారని’ సీఎం కార్యాలయ కార్యదర్శి అశ్వని కుమార్ పేర్కొన్నారు. భద్రతా చర్యల దృష్ట్యా, సీఎం నివాసంలోకి బయటి వ్యక్తిని అనుమతించడం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో వారం రోజులపాటు వీడియో కాన్ఫరెన్స్ మరియు టెలి కాలింగ్ ద్వారా ఎవరినీ కలవకుండా పరిపాలనను నిర్వహించాలని రూపానీ నిర్ణయించుకున్నట్టు గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. మరోవైపు గుజరాత్లో ఇప్పటివరకూ 650 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 59 మంది పూర్తిగా కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో ఈ వైరస్ వలన 28 మంది మరణించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]