కరోనా బారిన కుటుంబం.. తెలంగాణలో కొత్తగా 19 కేసులు.. ఏపీలోనూ కలకలం.. దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ.. ఇలా కరోనాకు చెందిన వార్తలు మళ్లీ మొదలయ్యాయి. దీంతో మాస్క్ లు మళ్లీ మూతికి వచ్చాయి. జ్వరం.. జలుబు.. దగ్గు.. ఇలా ఏ చిన్న సమస్య వచ్చినా జనం భయంతో ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. అయితే.. కరోనా కొత్త వేరియంట్ ప్రమాదకరమా..? అంటే భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. దీనికి టీకా అవసరమూ లేదని చెబుతున్నారు. కేసుల తీవ్రత, మరణాలు ప్రస్తుతానికి భయపడాల్సిన రీతిలో లేదని అంటున్నారు.
దేశంలో కరోనా కొత్త వేరియంట్ బయటపడటంతో ముందు జాగ్రత్త చర్యలుగా కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తంగా చేసింది. రాష్ట్రాల్లోనూ పరీక్షల సంఖ్య పెంచారు. ఈ నేపథ్యంలో కొన్ని కేసులు వెలుగుచూస్తున్నాయి. వారిలో చాలా మంది ఓపీ చికిత్సతోనే నయం అవుతోందని వైద్యులు చెబుతున్నారు. జేఎన్ 1గా పిలుస్తున్న ఈ కొత్త వేరియంట్ కేసులు కేరళలో బయటపడటమే కాకుండా క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుండడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. అయితే.. కేరళలో వెలుగు చూసిన ఈ కొత్త వేరియంట్ జేఎన్ 1 ప్రపంచవ్యాప్తంగా 38 దేశాల్లో విస్తరిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం సింగపూర్లో ఈ వేరియంట్ ఉధృతంగా ఉంది. కేవలం వారం రోజుల వ్యవధిలో 56 వేల కేసులు నమోదయ్యాయి. దాంతో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేసింది. కేసుల సంఖ్య ఇంకా పెరిగితే లాక్డౌన్ విధిస్తామని సింగపూర్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. అటు మలేషియాలో కూడా కేసులు పెరుగుతున్నాయి.
అయినప్పటికీ.. ఒమిక్రాన్ అంత వేగంగా కరోనా కొత్త వేరియంట్ జేఎన్ 1 వ్యాపించడం లేదని వైద్యులు చెబుతున్నారు. అయితే చలికాలం కాబట్టి కరోనా జాగ్రత్తలు పాటించాల్సిందే అని చెబుతున్నారు. వ్యాక్సిన్ వేసుకున్నవారికి సైతం కరోనా కొత్త వేరియంట్ సోకుతోందని వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం వ్యాపిస్తున్న కరోనా వేరియంట్ లో జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి, కడుపు నొప్పి, శ్వాసకోశ సమస్యలు కన్పిస్తున్నాయని గుర్తించారు. ప్రస్తుతం క్రిస్మస్, కొత్త సంవత్సరం, సంక్రాంతి ఇలా పండుగల సీజన్ కావడంతో కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఎక్కువ సంఖ్యలో నిర్వహించాలని ఆదేశించింది. ఎందుకంటే కొత్త వేరియంట్ ఆర్టీపీసీఆర్ పరీక్షలతో తెలుస్తోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఇప్పటికే అన్ని జిల్లాలు, ఆసుపత్రులలో కరోనాకు ప్రత్యేక వార్డులు కూడా సిద్ధం చేశారు. జలుబు పెరగడం వల్ల దగ్గు, జలుబు, సాధారణ ఫ్లూతో బాధపడే వారి సంఖ్య కూడా పెరిగింది. సాధారణ దగ్గు, జలుబు తర్వాత కూడా, ప్రజలు ఆసుపత్రులకు చేరుకుంటున్నారు. కోవిడ్ కోసం పరీక్షించమని వైద్యులను అభ్యర్థిస్తున్నారు. అయినప్పటికీ, వైద్యులు అనవసరమైన పరీక్షలు, మందుల వాడకం కోసం రోగులను నిరాకరిస్తున్నారు. వాతావరణ మార్పులతో కూడా జలుబు పెరగడం వల్ల దగ్గు, జలుబు, సాధారణ ఫ్లూతో బాధపడే వారి సంఖ్య పెరిగింది. సాధారణ దగ్గు, జలుబు తర్వాత కూడా, ప్రజలు ఆసుపత్రులకు చేరుకుంటున్నారు. కోవిడ్ కోసం పరీక్షించమని వైద్యులను అభ్యర్థిస్తున్నారు. అయినప్పటికీ, వైద్యులు అనవసరమైన పరీక్షలు, మందుల వాడకం కోసం రోగులను నిరాకరిస్తున్నారు. ఎందుకంటే చివరిసారిగా రెండవ కరోనాలో, ప్రజలు అనవసరమైన మందులను అధిక మోతాదులో తీసుకున్నారు, దాని దుష్ప్రభావాలు ఇప్పటికీ కనుగొనబడుతున్నాయి.
జ్వరం, దగ్గు, జలుబు కోసం మందులు వైద్యుడిని సంప్రదించకుండా తీసుకోకూడదు ఎందుకంటే వ్యక్తి యొక్క పరిస్థితి మరియు వయస్సు ప్రకారం మోతాదు ఇవ్వబడుతుంది, కాబట్టి వైద్యుని సలహా మేరకు పని చేయాలి. దగ్గు, జలుబు మొదలైన వాటికి ప్రజలు యాంటీబయాటిక్స్ వాడతారు, ఇది సాధారణ విషయమే కానీ ఇది సరైనది కాదని డాక్టర్ అంకుర్ పాండే చెప్పారు. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఏర్పడుతుంది. ఇది కాకుండా, ప్రతి ఔషధానికి ఒక సమయం మరియు మోతాదు ఉంటుంది, అందువల్ల అతను ప్రజలను వైద్యులను సంప్రదించిన తర్వాత మాత్రమే మందులు తీసుకోవాలని, లేకుంటే అది దుష్ప్రభావాలు కలిగి ఉండవచ్చని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కరోనా బారిన పడ్డారు. మొదట ఆ కుటుంబంలోని వృద్ధురాలికి కొవిడ్ నిర్ధారణ అయింది. దీంతో ఆ కుటుంబంలోని మిగతా నలుగురు కూడా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకున్నారు. ఆ నలుగురికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఐదుగురిని ఇంట్లోనే అధికారులు ఐసోలేషన్లో ఉంచారు. కరోనా బారిన పడ్డ ఐదుగురి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీఎంహెచ్వో మధుసూదన్ వెల్లడించారు. కరోనా కేసులు అలజడి సృష్టిస్తున్న నేపథ్యంలో పదేండ్ల లోపు చిన్నారులు, 60 ఏండ్లు పైబడ్డ వారు జాగ్రత్తగా ఉండాలని, అనవసరంగా తమ నివాసాల నుంచి బయటకు రాకూడదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సూచించింది. ఇక ఇంటి నుంచి బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ఆదేశించింది. జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే తక్షణమే కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని సూచించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE