టీ20 ప్రపంచ కప్-2021 క్రీడాభిమానులను విశేషంగా అలరించిన సంగతి తెలిసిందే. నవంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించి, తొలిసారిగా టీ20 ప్రపంచ కప్ ను కైవసం చేసుకుంది. కాగా ఈ టీ20 ప్రపంచకప్లో అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆటగాళ్లతో కూడిన “మోస్ట్ వాల్యూబుల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్” ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం నాడు ప్రకటించింది. అయితే ఐసీసీ ప్రకటించిన ఈ టీమ్ లో ఒక్క భారత క్రికెటర్ కు కూడా చోటు దక్కకపోవడం గమనార్హం.
టీ20 ప్రపంచ కప్ గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టు నుంచి ముగ్గురు, ఫైనల్లో రన్నరప్ గా నిలిచిన న్యూజిలాండ్ జట్టు నుంచి ఒకరు, అలాగే పాకిస్థాన్ జట్టు నుంచి ఒకరు, ఇంగ్లాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్ల నుంచి తలో ఇద్దరు ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజామ్ ను కెప్టెన్గా, డేవిడ్ వార్నర్, జోస్ బట్లర్ లను ఓపెనర్లుగా, పాకిస్థాన్ పేసర్ షహీన్ షా అఫ్రిదీని రిజర్వ్ ప్లేయర్ గా ఐసీసీ ఎంపిక చేసింది.
ఐసీసీ ప్రకటించిన మోస్ట్ వాల్యూబుల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇదే :
- డేవిడ్ వార్నర్
- జోస్ బట్లర్ (వికెట్ కీపర్)
- బాబర్ ఆజామ్ (కెప్టెన్)
- చరిత్ అసలంక
- ఐడెన్ మార్క్రమ్
- మొయిన్ అలీ
- వణిందు హసరంగ
- ఆడమ్ జంపా
- జోష్ హేజిల్ వుడ్
- ట్రెంట్ బౌల్ట్
- అన్రిచ్ నార్జ్
- షహీన్ షా అఫ్రిది – రిజర్వ్ ప్లేయర్
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ