ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ అభ్యర్థులను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా నుంచి పాలవలస విక్రాంత్, కర్నూలు జిల్లా నుంచి ఇసాక్ బాషా, కడప జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డిలను పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థులైన పాలవలస విక్రాంత్, ఇసాక్ బాషా, డీసీ గోవిందరెడ్డిలు మంగళవారం ఉదయం సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ వారికీ బీఫాంలు అందజేశారు. మరోవైపు ఎమ్మెల్సీ నామినేషన్ల దాఖలుకు ఈరోజే చివరిరోజు కావడంతో, వీరంతా మరికాసేపట్లో నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF