తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ (టీఆర్ఎస్) తమ అభ్యర్థుల పేర్లను మంగళవారం నాడు ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, పాడి కౌశిక్రెడ్డి, బండ ప్రకాష్ పేర్లను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇక ఎమ్మెల్సీ నామినేషన్ల దాఖలుకు ఈరోజే చివరిరోజు కావడంతో, వీరంతా వెంటనే నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు ఈ ఆరు ఎమ్మెల్సీ స్థానాలు దక్కించుకునేందుకు సరిపడా ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీకి ఉండడంతో, ఇతర పార్టీలు పోటీలో లేకపోవడంతో అందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ