అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం నాడు ఐసీసీ వార్షిక పురుషుల టీమ్ ర్యాంకింగ్స్ను ప్రకటించింది. టీ20 టీమ్ ర్యాంకింగ్స్లో టీమిండియా 270 పాయింట్స్ తో అగ్రస్థానాన్ని నిలుపుకుంది. ఇక టెస్టు టీమ్ ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా 128 పాయింట్స్ తో నెంబర్ వన్ స్థానంలో నిలువగా, వన్డేల్లో న్యూజిలాండ్ జట్టు 125 పాయింట్స్ తో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఐసీసీ ప్రకటించిన వార్షిక అప్డేట్ మే 2019 నుండి పూర్తయిన అన్ని సిరీస్లను ప్రతిబింబిస్తుంది. మే 2021కి ముందు ఆడిన సిరీస్లు 50 శాతం మరియు ఆ తదుపరి సిరీస్లు 100 శాతం వెయిటేజి చేయబడ్డాయి.
ఐసీసీ మెన్స్ టీ20 ర్యాంకింగ్స్ – వార్షిక అప్డేట్:
1. ఇండియా – 270 (రేటింగ్ )
2. ఇంగ్లాండ్ – 265
3. పాకిస్తాన్ – 261
4. సౌత్ ఆఫ్రికా – 253
5. ఆస్ట్రేలియా – 251
6. న్యూజిలాండ్ – 250
7. వెస్ట్ ఇండీస్ – 240
8. బంగ్లాదేశ్ – 233
9. శ్రీలంక – 230
10. ఆఫ్గనిస్తాన్ – 226
ఐసీసీ మెన్స్ టెస్టు ర్యాంకింగ్స్ – వార్షిక అప్డేట్:
1. ఆస్ట్రేలియా – 128 (రేటింగ్ )
2. ఇండియా – 119
3. న్యూజిలాండ్ – 111
4. సౌత్ ఆఫ్రికా – 110
5. పాకిస్తాన్ – 93
6. ఇంగ్లాండ్ – 88
7. శ్రీలంక – 81
8. వెస్ట్ ఇండీస్ – 77
9. బంగ్లాదేశ్ – 51
10. జింబాంబ్వే – 25
ఐసీసీ మెన్స్ వన్డే ర్యాంకింగ్స్ – వార్షిక అప్డేట్:
1. న్యూజిలాండ్ – 125 (రేటింగ్ )
2. ఇంగ్లాండ్ – 124
3. ఆస్ట్రేలియా – 107
4. ఇండియా – 105
5. పాకిస్తాన్ – 102
6. సౌత్ ఆఫ్రికా – 99
7. బంగ్లాదేశ్ – 95
8. శ్రీలంక – 87
9. వెస్ట్ ఇండీస్ – 73
10. ఆఫ్గనిస్తాన్ – 66
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ